News March 3, 2025
ఆసిఫాబాద్: ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల దృశ్య ఓట్ల లెక్కింపు కారణంగా ప్రజా ఫిర్యాదుల విభాగం సోమవారం వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు సహకరించగలరని ఆయన కోరారు.
Similar News
News December 1, 2025
NGKL:డాక్టర్ వెంకటదాస్ సేవలు మరువలేనివి

NGKL డివిజన్ డిప్యూటీ DMHOగా పనిచేసిన డాక్టర్ ఎం.వెంకటదాస్ సివిల్ సర్జన్ RMO పదోన్నతితో జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీపై వెళ్తుండడంతో, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆయనను సత్కరించారు. ఆరోగ్య సూచికలు మెరుగుపరిచేందుకు వెంకటదాస్ సేవలు విశిష్టమైన DMHO డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కార్యాచరణలో జిల్లా ముందంజలో ఉండడానికి ఆయన మార్గదర్శకత్వం ఎంతో విలువైందని అన్నారు.
News December 1, 2025
పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్సభ

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.
News December 1, 2025
డీఎస్సీ-2025 టీచర్ల వేతనాల పట్ల ఆందోళన

డీఎస్సీ-2025తో ఎంపికైన టీచర్లకు 2 నెలలు గడిచినా జీతాలు విడుదల కాకపోవడంపై ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్ ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త టీచర్లు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇతర శాఖల నుంచి ఎంపికైన వారికి లాస్ట్ పే సర్టిఫికెట్, సర్వీస్ రిజిస్టర్ ఇవ్వకపోవడం, డీడీఓ లాగిన్లో వివరాలు తొలగించకపోవడంతో విద్యాశాఖ జీతాల బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.


