News July 13, 2024

ఆసిఫాబాద్: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి: కలెక్టర్

image

కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే శుక్రవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 24, 2025

ADB: నేటి నుంచి పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్స్ ప్రారంభం

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ఈనెల 27 నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించనుండగా ఈ రోజు(24వ తేదీ) నుంచి రైతులు తమ పంట విక్రయించేందుకు కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

News October 24, 2025

ADB: జిల్లాస్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు

image

ఆదిలాబాద్‌ జిల్లా స్థాయి యువజనోత్సవాలను నవంబర్ 4న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల యువత ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పాటలు, వక్తృత్వం, శాస్త్రీయ నృత్యం, క్విజ్, ఫోక్ సాంగ్స్ వంటి ఏడు అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 3 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, పోటీలు డీఆర్‌డీఏ మీటింగ్ హాలులో జరుగుతాయని వివరించారు.

News October 24, 2025

ఆదిలాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల

image

పదో తరగతి ఫైనల్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిందని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్‌ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18లోపు అందించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు అవకాశం ఉందన్నారు.