News February 28, 2025

ఆసిఫాబాద్‌: బర్డ్ ఫ్లూ.. భయపడుతున్న జనం

image

బర్డ్ ఫ్లూ వైరస్ ASF జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులకు ఇబ్బందులు పడుతున్నాయి. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో జనం చికెన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 250 పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు కాగజ్‌నగర్ పట్టణంలోని చికెన్ దుకాణ యజమానులు చికెన్ మేళా నిర్వహిస్తున్నారు.

Similar News

News December 10, 2025

MBNR: అతిథి అధ్యాపక పోస్టుకు నోటిఫికేషన్

image

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.కె.పద్మావతి తెలిపారు. సంబంధించిన పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 11 నుంచి 12 వరకు అందజేయాలని తెలిపారు.

News December 10, 2025

వనపర్తి: ‘మూడు నెలల జీతాలు పెండింగ్’

image

3నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు DM&HO డా.సాయినాథ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జీవో 1195 ప్రకారం ప్రతి ఉద్యోగికి రూ.19,500 చెల్లించాలని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11 నుంచి 19ఆన్‌లైన్ వర్క్ బంద్ చేస్తున్నట్లు, 19లోపు వేతనాలు ఇవ్వని పక్షంలో 20 నుంచి నిరవధిక సమ్మే చేస్తామన్నారు.

News December 10, 2025

విశాఖలో టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు

image

విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారు. పరీక్షల సరళిని డీఈవో స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను సందర్శించి పరిశీలించింది. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.