News March 30, 2025
ఆసుపత్రిని తర్వగా నిర్మించాలి: MNCL కలెక్టర్

మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం పరిశీలించారు. జిల్లాలోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం నూతన ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
Similar News
News November 26, 2025
18 ఏళ్ల యువతను గౌరవిద్దాం: మోదీ

ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందని PM మోదీ చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘18ఏళ్లు నిండి, తొలిసారి ఓటు వినియోగించుకునే యువతను ఏటా NOV 26న విద్యాసంస్థల్లో గౌరవించాలి. విధులు పాటిస్తేనే హక్కులు వస్తాయన్న గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి’ అని పేర్కొన్నారు.
News November 26, 2025
BREAKING: భారత్ ఘోర ఓటమి

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ భారత్ ఘోర ఓటమిపాలైంది. ఐదో రోజు రెండో ఇన్నింగ్సులో 140 స్కోరుకే ఆలౌటైంది. జడేజా(54) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. సైమన్ 6, కేశవ్ 2, ముత్తుసామి, మార్కో చెరో వికెట్ తీశారు. దీంతో సఫారీలు 408 రన్స్ తేడాతో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేశారు.
స్కోర్లు: SA.. 489/10, 260/5(డిక్లేర్డ్), IND.. 201/10, 140/10
News November 26, 2025
KMR: గెలుపు గుర్రాలకై వేట.. ఎన్నికలపై ఉత్కంఠ

కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. కోడ్ విడుదల కావడంతో ఎన్నికలు త్వరలోనే జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ అనుచరులతో, సమావేశాలు నిర్వహిస్తూ, గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నాయకులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ అధిష్ఠానాలు కూడా విజయావకాశాలు మెరుగ్గా ఉన్న అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.


