News March 26, 2025

ఆస్తి కోసం తండ్రిని చంపిన కుమారుడు

image

ఆస్తి తగాదాలో తండ్రిని గొడ్డలితో నరికి చంపిన ఘటన రాయదుర్గం మండలం టి.వీరాపురంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. 2 ఎకరాల భూమిని తనకు రాసివ్వాలని తండ్రి సుంకప్పతో కొడుకు వన్నూరుస్వామి తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కోపోద్రిక్తుడై మంచంపై నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 19, 2025

ADB: కలెక్టర్ సార్.. మీ కోసమే ఎదురుచూపులు

image

”స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లయినా మా గ్రామానికి రోడ్డు లేక నరకయతన పడుతున్నాం. విద్య, వైద్యం పొందలేక అవస్థలు పడుతున్నాం. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్ వెళ్లలేని పరిస్థితి. నిత్యవసరాలకీ నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేక పిల్లలు చదువులకు దూరమయ్యారు” అంటూ గుబిడి గ్రామస్థులు కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం చర్చనీయంగా మారింది. మండల పర్యటనకు రానున్న కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

News September 19, 2025

కాకినాడ జిల్లాకు పేరు మార్చాలని డిమాండ్

image

పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరును కాకినాడ (D)కు పెట్టాలని అనపర్తి మాజీ MLA శేషారెడ్డి సూచించారు. తమ ఇన్స్టిట్యూషన్స్ & మహారాజా ఫౌండేషన్ ప్రతియేటా జాతీయ స్థాయి కథ, కవితా సంపుటాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విద్య, దళితుల కోసం ఆయన ఎంతో శ్రమించారన్నారు. శ్రీకృష్ణ దేవరాయల తర్వాత అదే స్థాయిలో ప్రజలను ఆదరించిన మహనీయుడి పేరును జిల్లాకు పెట్టాలని కోరారు. దీనిపై మీరేమంటారు.కామెంట్ చేయండి.

News September 19, 2025

KNR: ‘పాఠశాలల్లో విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన’

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులను అనుసరించి విద్యాబోధన చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులున్నారు.