News March 26, 2025
ఆస్తి కోసం తండ్రిని చంపిన కుమారుడు

ఆస్తి తగాదాలో తండ్రిని గొడ్డలితో నరికి చంపిన ఘటన రాయదుర్గం మండలం టి.వీరాపురంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. 2 ఎకరాల భూమిని తనకు రాసివ్వాలని తండ్రి సుంకప్పతో కొడుకు వన్నూరుస్వామి తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కోపోద్రిక్తుడై మంచంపై నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News July 11, 2025
KNR: విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది: USFI

KNR జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలను తక్షణమే మూసివేయాలని USFI (యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) డిమాండ్ చేసింది. ఈ మేరకు USFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంద గణేష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు DIEOకి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. అక్రమంగా నడుస్తున్న ఈ కళాశాలల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
News July 11, 2025
కృష్ణా: ‘ఈనెల 14 లోపు పాఠశాలలకు హాజరు కావాలి’

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్లు భర్తీ చేయడానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేశామని సమన్వయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగా సీట్లు పొందిన విద్యార్థులకు ఇప్పటికే ఫోన్ ద్వారా సమాచారం అందించామన్నారు. ఈ నెల 14వ తేదీలోగా వారందరూ అన్ని ధ్రువీకరణ పత్రాలతో గురుకుల పాఠశాలలో హాజరు కావాలని సూచించారు.
News July 11, 2025
GNT: యువతకు ముఖ్య గమనిక

తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న అప్రెంటిస్ మేళా జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మేళా ప్రారంభమవుతుంది. అనేక ప్రైవేట్ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఐటీఐ పూర్తి చేసిన యువత బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని ప్రిన్సిపల్ చిన్న వెంకటేశ్వర్లు సూచించారు. ఉపాధి అవకాశాల కోసం మేళాను ఉపయోగించుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.