News March 11, 2025

ఆస్తి కోసమే.. తల్లిని హత్య చేశాడు!

image

నంద్యాల(D) ఉయ్యాలవాడలో నిన్న కసాయి కొడుకు తల్లిని హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. పుల్లమ్మ (75) కొడుకు గురవయ్య మద్యానికి బానిసయ్యాడు. అతడి వేధింపులు భరించలేక తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల పుల్లమ్మ ఆస్తిని తన మనవడి పేరుపై రాసింది. దీంతో తన పేరుపై రాయించాలని తల్లితో గొడవపడేవారు. సోమవారం ఉదయం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు.

Similar News

News December 7, 2025

న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

image

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్‌దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్‌(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్‌గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.

News December 7, 2025

NZB:16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

image

నిజామాబాద్ శివారులోని గూపన్‌పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్‌ను కత్తిరించినట్లు గుర్తించారు. దీంతో ఎలక్ట్రిసిటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO పేర్కొన్నారు.

News December 7, 2025

ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. శనివారం పెద్దేముల్ జూనియర్ కళాశాలలో ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులను సందర్శించారు. ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రతన్ సింగ్, ఎంఈఓ నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.