News March 11, 2025

ఆస్తి కోసమే.. తల్లిని హత్య చేశాడు!

image

నంద్యాల(D) ఉయ్యాలవాడలో నిన్న కసాయి కొడుకు తల్లిని హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. పుల్లమ్మ (75) కొడుకు గురవయ్య మద్యానికి బానిసయ్యాడు. అతడి వేధింపులు భరించలేక తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల పుల్లమ్మ ఆస్తిని తన మనవడి పేరుపై రాసింది. దీంతో తన పేరుపై రాయించాలని తల్లితో గొడవపడేవారు. సోమవారం ఉదయం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు.

Similar News

News December 4, 2025

S-500 గురించి తెలుసా?

image

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్‌గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.

News December 4, 2025

కామారెడ్డి: 3వ విడత తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే?

image

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, డోంగ్లి, మద్నూర్, జుక్కల్, నస్రుల్లాబాద్, బీర్కూర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల్లో 3వ విడత ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు దాఖలైన నామినేషన్లను అధికారులు వెల్లడించారు.168 సర్పంచ్ స్థానాలకు 128 నామినేషన్లు రాగా, 1,482 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేపటి వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.

News December 4, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో గురువారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.