News April 2, 2025
ఆస్తి పన్ను వసూళ్లు.. నాలుగో స్థానంలో మంచిర్యాల

2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్లో లక్షట్టిపేట మున్సిపాలిటీ 70.22 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ 56.25శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 64.73 శాతంతో 4వ స్థానంలో నిలిచింది. మందమర్రి 76.86%, క్యాతనపల్లి 76.14%, చెన్నూరు 61.05 శాతం పన్ను వసూళ్లు చేపట్టాయి.
Similar News
News November 20, 2025
BSNL.. రూ.2,399కే ఏడాదంతా..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నట్లు పేర్కొంది. రూ.2,399తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. కాగా జియో, ఎయిర్టెల్ ఏడాది ప్లాన్స్ రూ.3,500కు పైగానే ఉన్నాయి. అయితే BSNL నెట్వర్క్ మెరుగుపడాలని, అది సరిగా లేకుంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా లాభం లేదని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 20, 2025
తండ్రి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి

ఖమ్మం కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తన భార్య సాయి వాణిని భర్త భాస్కర్ అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా మొదట తన కన్న కూతురిని చంపేందుకు భాస్కర్ ప్రయత్నించగా అతడి నుంచి చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ దాడి ఘటనలో చిన్నారి మూడు వేళ్లు తెగిపోయాయని స్థానికులు తెలిపారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 20, 2025
KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్.. వివరాలు ఇవే!

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ACB గతంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు ACB విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ రికార్డులు కలెక్ట్ చేసింది. దీనిపై KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్లో ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరగా ఇప్పుడు <<18337628>>పర్మిషన్<<>> ఇచ్చారు.


