News January 6, 2025

ఆస్పరి: ఆడుకుంటూ నిప్పు అంటించుకున్న చిన్నారులు

image

ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు బైక్‌లో పెట్రోల్‌ను బాటిల్లోకి తీసుకొని, ఒకరిపై ఒకరు చల్లుకొని నిప్పు అంటించుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News November 26, 2025

జాతీయ స్థాయిలో కర్నూలుకు పతకాలు

image

ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో జరిగిన 8వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల(క్యాడెట్ విభాగం-అండర్ 45)లో జిల్లా క్రీడాకారులు కార్తీక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శిక్షకుడు సతీశ్ తెలిపారు. మరో క్రీడాకారిణి గాయత్రి 41వ సీనియర్ అండర్-53 విభాగంలో రన్నర్‌గా నిలిచారన్నారు. వారిని మంగళవారం ఘనంగా సత్కరించారు.

News November 26, 2025

జాతీయ స్థాయిలో కర్నూలుకు పతకాలు

image

ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో జరిగిన 8వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల(క్యాడెట్ విభాగం-అండర్ 45)లో జిల్లా క్రీడాకారులు కార్తీక్ ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శిక్షకుడు సతీశ్ తెలిపారు. మరో క్రీడాకారిణి గాయత్రి 41వ సీనియర్ అండర్-53 విభాగంలో రన్నర్‌గా నిలిచారన్నారు. వారిని మంగళవారం ఘనంగా సత్కరించారు.

News November 26, 2025

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్పీ

image

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. యువత పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.