News February 8, 2025
ఆహార శుద్ధి పరిశ్రమకు అగ్రిమెంట్

భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రైతు సోదరులతో అగ్రిమెంట్ చేయించుకుని ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు తెలిపారు. ఈ జిల్లాలో పండుతున్న పంటలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునే విధంగా శనివారం నాబార్డ్ జీఎం తో సమావేశమయ్యారు. నాబార్డ్ అధికారులు సొసైటీ డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.
Similar News
News March 2, 2026
ప్రొద్దుటూరులో భారీగా పెరిగిన బంగారు, వెండి ధరలు.!

బంగారం వ్యాపారంలో రెండో ముంబయిగా పేరుపొందిన ప్రొద్దుటూరులో సోమవారం బంగారు, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.17,000
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,640
*వెండి 10 గ్రాముల ధర రూ.2,992గా ఉంది.
News March 2, 2026
మదనపల్లి: ‘ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలి’

మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)’ లో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన ఆయన, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలపై వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. చట్ట పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
News March 2, 2026
J&K: ఖమేనీ మద్దతుదారులపైకి టియర్ గ్యాస్

అయతుల్లా ఖమేనీ హతానికి నిరసనగా జమ్మూకశ్మీర్లో షియా ముస్లిములు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ జెండాలతో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇలా చేసినట్టు సమాచారం. ఉదయం నుంచి శ్రీనగర్లో షియాలు బంద్ పాటిస్తూ నిరసన చేపట్టడం తెలిసిందే. దీంతో అల్లర్లు జరగకుండా దేశవ్యాప్తంగా ఐబీ అలర్టైంది. రాష్ట్రాలకూ సూచనలు జారీ చేసింది.


