News January 16, 2025
ఆ ఇద్దరూ వీఆర్ లా కళాశాల విద్యార్థులే

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా యడవల్లి లక్ష్మణరావు, హరిహరనాథ శర్మల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులు నెల్లూరులోని వీఆర్ లా కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. కర్నూలుకు చెందిన హరిహరనాథశర్మ న్యాయవాదిగా అక్కడే ప్రాక్టీస్ చేయగా, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన లక్ష్మణరావు సొంత జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలోనూ ప్రాక్టీస్ చేశారు.
Similar News
News October 25, 2025
రిజిస్ట్రేషన్స్ కోసం వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి : జిల్లా రిజిస్ట్రార్

ప్రభుత్వం ఎవ్వరినీ దస్తావేజు లేఖరులుగా నియమించలేదని, లైసెన్స్ ఇవ్వలేదని ప్రజలు తమకు తామే IGRS (www.registration.ap.gov.in) వెబ్ సైట్లో ఉన్న నమూనాలను ఉపయోగించుకుని దస్తావేజులు తయారు చేసుకోవచ్చని జిల్లా రిజిస్ట్రారు బాలాంజనేయులు తెలిపారు. చలానాలు చెల్లించి ప్రజలకు కావలసిన సమయంలో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా సబ్-రిజిస్ట్రార్లని సంప్రదించి తమ దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
News October 25, 2025
కర్నూలు ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: MP

కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులను MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. తన తరపున రూ.5 లక్షలను కుటుంబానికి అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అదేవిధంగా గుడ్లూరు(M) దారకానిపాడు హత్యోదాంత బాధితులను MLA ఇంటూరి నాగేశ్వరావుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు ఆర్ధిక సాయం అందజేశారు.
News October 25, 2025
నెల్లూరు: సమ్మె విరమించిన PHC వైద్యులు

నెల్లూరు జిల్లాలోని PHC వైద్యులు సమ్మె విరమించి ఇవాళ నుంచి విధులకు హజరవుతున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. మంత్రి 2025-26 విద్యా సంవత్సరంలో PG మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు హామీ ఇచ్చారని, ట్రైబల్ అలవెన్స్, టైంబౌండ్ పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, అర్బన్ సర్వీస్ ఎలిజిబులిటీ ఐదేళ్లకు కుదింపు వంటిసమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు.


