News April 16, 2025

ఆ ఉపాధ్యాయులకు అభినందనలు: నాగర్‌కర్నూల్ డీఈవో 

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 7న ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం మంగళవారం ముగిసింది. ప్రాధాన్యతతో మూల్యాంకనం పూర్తి చేశామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు డీఈవో రమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో త్వరితగతిన మూల్యాంకనం పూర్తి చేసిన ఉపాధ్యాయులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 7, 2026

తెలుగులో ఛార్జ్‌‌షీట్.. పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం

image

TG: పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాల సమర్పణ అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. దీంతో అటు బాధితులు, ఇటు నిందితులకు అందులోని అంశాలు అర్థం కాక ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో దుండిగల్ PS​లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగులో 2 ఛార్జ్‌‌షీట్లు దాఖలు చేసి పోలీస్ శాఖలో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ శిఖా గోయల్ ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు.

News January 7, 2026

వంటింటి చిట్కాలు మీకోసం

image

* కొబ్బరి ముక్కలు నిల్వ ఉన్నా వాసన రాకుండా ఉండాలంటే, చిప్పల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేయాలి.
* బాదం, వేరుశనగ, జీడిపప్పు ప్లాస్టిక్ సంచుల్లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే త్వరగా మెత్తబడిపోవు.
* బిస్కట్లు నిల్వ చేసే డబ్బాలో అడుగున ఒక బ్రెడ్ స్లైస్ ఉంచితే కరకరలాడుతూ ఉంటాయి.
* చక్కెరను పొడిలా చేస్తున్నప్పుడు కొన్ని బియ్యపు గింజలు కూడా వేయండి. ఇలా చేస్తే చక్కెర ముద్ద కాకుండా పొడిలా వస్తుంది.

News January 7, 2026

ఏడు చేపల కథలో అంతరార్థం ఇదే..

image

7 చేపల కథలో ఆధ్యాత్మిక పరమార్థం ఉంది. కథలోని రాజు మనిషైతే ఏడుగురు కొడుకులు మనలోని సప్తధాతువులు. ఎండని ఏడో చేపే మన మనసు. 6 అరిషడ్వర్గాలను జయించినా, చంచలమైన మనస్సును జయించడం కష్టం. దీనికి అడ్డుపడే గడ్డిమేటు మన అజ్ఞానం. ఈ అజ్ఞానం పోవాలంటే జ్ఞానమనే ‘ఆవు’ మేయాలి. ఆ ఆవును మేపాల్సింది సద్గురువు. సంసారమనే చీమ కుట్టే బాధల నుంచి విముక్తులై గురువు ద్వారా జ్ఞానాన్ని పొందితేనే మోక్షం లభిస్తుందని కథా సారాంశం.