News April 16, 2025

ఆ ఉపాధ్యాయులకు అభినందనలు: నాగర్‌కర్నూల్ డీఈవో 

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 7న ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం మంగళవారం ముగిసింది. ప్రాధాన్యతతో మూల్యాంకనం పూర్తి చేశామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు డీఈవో రమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో త్వరితగతిన మూల్యాంకనం పూర్తి చేసిన ఉపాధ్యాయులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News November 24, 2025

గోపాలపురం: హామీ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి

image

గోపాలపురం నియోజకవర్గం ఐ.ఎస్.జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను ఆలయ అధికారులకు అందించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

News November 24, 2025

రిజర్వేషన్ల ప్రక్రియ పునః పరిశీలన: మంచిర్యాల కలెక్టర్

image

రాజ్యాంగ నిబంధన, తెలంగాణ రాష్ట్ర పంచాయతి రాజ్ చట్టం, జనాభా ప్రాతిపాదికన ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వారి జనాభా సంఖ్య కంటే తక్కువగా ఉండకూడదని, అదేవిధంగా మొత్తం రిజర్వేషన్స్ 50%కి మించకూడదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలోని 306 గ్రామపంచాయతీలు, 2680 వార్డు సభ్యుల స్థానాలకు ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న నియమావళి ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ పునఃపరిశీలన చేస్తామన్నారు.

News November 24, 2025

పాల్వంచ: ‘ఆర్థిక రక్షణ కల్పించే దిశగా బీమా పెంపు’

image

జిల్లాలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన బీమా పెంపును ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కలెక్టరేట్లో సోమవారం కార్మికుల బీమా పెంపు గోడపత్రికను ఆవిష్కరించారు. కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా బీమా మొత్తం పెంపు ఒక చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.