News January 31, 2025
ఆ కారణంతోనే మాపై కేసులు: ఎంపీ మిథున్ రెడ్డి

రాజకీయ కక్షతోనే చంద్రబాబు తమపై కేసులు పెడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. మంగళంపేటలో 75 ఎకరాలు కొన్నామని, ఈ భూమి అటవీశాఖకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. తమ ఊర్లో హాస్పిటల్ నిర్మాణానికి రూ.15 కోట్ల విలువైన భూమిని ఇచ్చామని, అలాంటిది కేవలం రూ.3 కోట్ల భూమిని కబ్జా చేశామని చెప్పడం సరికాదన్నారు.
Similar News
News October 31, 2025
HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

కిషన్రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
News October 31, 2025
విశాఖపట్నం పోర్టులో 58 పోస్టులు

విశాఖపట్నం పోర్ట్ 58 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్/ డిప్లొమా అర్హతగల అభ్యర్థులు NOV 1 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 27, టెక్నీషియన్ అప్రెంటిస్లు 31 ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు నెలకు రూ.9వేలు, టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: vpt.shipping.gov.in
News October 31, 2025
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కవిత

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన,బూజు పట్టిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్నారు.


