News December 30, 2024

ఆ ఘటనల్లో చర్యలు తీసుకోరా?: ఎమ్మిగనూరు MLA

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు ఎస్ఐపై దాడి, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థలో విశ్వాసం పెంచాలని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రశ్నించక మానరు అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 18, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్: కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ-దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి వెల్లడించారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News January 17, 2025

‘ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదు’

image

విజయ డెయిరీలో అప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం సమంజసం కాదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వర్గీయులు పాల ఉత్పత్తి కర్మాగారం వద్ద దౌర్జన్యం చేసి నామినేషన్లను వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. దౌర్జన్యాలకు దిగి ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా ఎన్నికలకు విలువ లేకుండా పోతుందన్నారు.

News January 17, 2025

‘చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీ’

image

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం హర్షనీయమని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. శుక్రవారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు  నాయకత్వంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రభుత్వం జీవం పోసిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ కృషి చేసిందన్నారు.