News April 2, 2024

ఆ ఘనత సీఎం జగన్ దక్కుతుంది: జెడ్పీ చైర్మన్

image

పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతనతో వైసీపీ మేమంతా సిద్ధం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, ఎంపీ అభ్యర్థి తనుజ పాల్గొన్నారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారిని లక్షాధికారులుగా చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అన్నారు

Similar News

News July 5, 2025

విజయనగరం: మా భవాని ‘బంగారం’

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటింది. కజికిస్తాన్‌లో జరుగుతున్న
ఏసియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భవాని అద్భుత ప్రతిభ కనబర్చడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు, జిల్లా క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News July 5, 2025

VZM: ‘ఈనెల 7న పోస్టల్ సేవలు బంద్’

image

ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఐటీ 2.0 రోల్ అవుట్ కారణంగా సేవలు నిలుపుదల చేస్తున్నామన్నారు. కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్‌ను పూర్తి చేసి ఈనెల 8 నుంచి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఖాతాదారులు గమనించాలని కోరారు.

News July 5, 2025

స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఎస్పీ సమీక్ష

image

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సమాచార ఏర్పాటు చేసుకోవాలని SP వకుల్ జిందాల్ కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు క్రియాశీలకమైనదని అన్నారు. ముందస్తు సమాచారం సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు.