News March 20, 2025
ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్.. అన్నీ బంద్: ఎస్పీ శ్రీనివాస్

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు.
Similar News
News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.
News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.
News November 18, 2025
తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.


