News February 9, 2025

ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేష్ బాబు

image

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.

Similar News

News February 15, 2026

గుంటూరు జిల్లా ప్రజలకు కీలక సూచన

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేశారు. మహాశివరాత్రి బందోబస్తు విధుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారులందరూ ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News February 15, 2026

ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

image

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.

News February 15, 2026

గుంటూరు జిల్లాలో శివరాత్రికి పటిష్ఠ భద్రత

image

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు శివాలయాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వడ్లమూడి, పెదకాకాని, పేరేచర్ల, తెనాలి, తాడేపల్లి ఆలయాల వద్ద ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.