News February 5, 2025
ఆ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి: KMR కలెక్టర్

గడువులోగా CMR పూర్తి చేయకుండా ఉదాసీనత ప్రదర్శించే మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులోగా 100% CMR పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి ప్రతి రోజు మిల్లులను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే రబీ వరి ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News February 8, 2025
అమెరికా అమ్మాయితో ఎన్టీఆర్ జిల్లా అబ్బాయి పెళ్లి

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్లకు చెందిన నంబూరు వరుణ్కు అమెరికా అమ్మాయితో వివాహమైంది. వరుణ్ USAలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో షర్లెట్కు చెందిన ఎరికాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లిగా మారింది. ఇద్దరు కుటుంబాల సమక్షంలో శుక్రవారం రాత్రి కొణిజర్లలో వారికి వివాహమైంది. నూతన వధూవరులను కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు.
News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్కు 10న ఒక్క రోజే గడువు ఉంది.
News February 8, 2025
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ ఇదేనా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం నడిచింది. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా కథ గురించి హింట్ ఇచ్చారు. ‘రాత్రుళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్రమైన కోణాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.