News December 13, 2024

ఆ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు: వనితా రాణి

image

ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 3 స్థానాలకు పోటీలో నిలిచిన సానా సతీశ్, బీద మస్తాన్(టీడీపీ)&ఆర్.కృష్ణయ్య(బీజేపీ) ఎన్నికయ్యారని ఆమె తెలిపారు. ఎన్నిక నిమిత్తం 6 నామినేషన్లు రాగా ఒకరి నామినేషన్ చెల్లలేదని, మిగతా ఇద్దరు ఉపసంహరించుకున్నారని వనితా రాణి చెప్పారు. 

Similar News

News January 22, 2025

ప్ర‌కృతి వ్య‌వ‌సాయం దిశ‌గా ముందడుగు వేయాలి: కలెక్టర్

image

సాగులో పెట్టుబ‌డి వ్య‌యం త‌గ్గించి, ఆదాయం పెంచే ల‌క్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంతో రైతుల‌ను చేయిప‌ట్టి న‌డిపిస్తోందని క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ సూచించారు. బుధ‌వారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, దాములూరులో నిర్వ‌హించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ఎలా ఉంది.? సాగుచేస్తున్న పంట‌లు గురించి అడిగి తెలుసుకున్నారు. 

News January 22, 2025

దుర్గగుడి ప్రధానార్చకులు మృతి

image

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.

News January 22, 2025

జి.కొండూరు: ప్రేయసి వెళ్లిపోయిందని సూసైడ్

image

ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.