News March 6, 2025
ఆ రూ.12 కోట్ల వసూలు చేయండి: VZM కలెక్టర్

లేబర్ సెస్ వసూలుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. మొత్తం నాలుగు విభాగాల్లో ఒక్క విజిలెన్స్ అలర్ట్ క్రింద సుమారు రూ.12 కోట్లు వరకు బకాయి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా దీనిని వసూలు చేయడమే కాకుండా, పెండింగ్లో ఉన్న సుమారు 1300 క్లైయిములను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 6, 2025
విజయనగరం: ‘లెక్కలు పరీక్షకు 999 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో 66 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కలు పరీక్షకు 999 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్ఐవోఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరీక్షకు 23,044 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22,045 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్ష ఏటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
News March 6, 2025
VZM: జిల్లా జడ్జిలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం

పట్టణంలోని స్థానిక జిల్లా కోర్టులో జడ్జిలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే క్రిమినల్, మోటార్, ప్రమాద బీమా, బ్యాంక్, చెక్ బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల సమక్షంలో పరిష్కరించలన్నారు.
News March 6, 2025
VZM: ఈ నెల 8 నుంచి 18 వరకు పి-4 సర్వే

పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్( పి-4) సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి-4 సర్వే పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రధానంగా జీరో పేదరికం లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పి-4 కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.