News January 8, 2025

ఆ రోజుల్లో రూ.575కే నెల్లూరు నుంచి శ్రీలంకకు టూర్

image

ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లినా కనీసం రూ.2 వేలు దాటుతోంది. ఓ బ్రాండెడ్ షర్ట్ ధర రూ.800పైనే ఉంటోంది. అయితే రూ.500కు శ్రీలంక వెళ్లొచ్చు అంటే మీరు నమ్మగలరా.. నిజమేనండి. కాకపోతే ఇది 50 ఏళ్లనాటి మాట. 1974లో ఓ ట్రావెల్ ఏజెన్సీ నెల్లూరు నుంచి రూ.575కే ఏకంగా 15 రోజుల పాటూ శ్రీలంకకు టూర్ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. ఇందుకు సంబందించి ఓ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ కామెంట్ చెప్పండి.

Similar News

News October 15, 2025

జిల్లా నుంచి PM కర్నూలు సభకు 250 బస్సులు కేటాయింపు

image

ఈనెల 16న కర్నూలు జిల్లాలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు జిల్లా నుంచి 250 బస్సులను అధికారులు కేటాయించారు. కర్నూలు(D) ఓర్వకల్లు మండలంలోని నన్నూరు వద్ద నిర్వహించే ఈ సభకు నెల్లూరు డిపో 1నుంచి 40, నెల్లూరు డిపో 2 నుంచి 50, ఆత్మకూరు డిపో నుంచి 31, కందుకూరు డిపో నుంచి 35, కావలి డిపో నుంచి 40, ఉదయగిరి డిపో నుంచి 29, రాపూరు డిపో నుంచి 25 వరకు బస్సులు కేటాయించారు.

News October 15, 2025

కౌశల్-2025 క్విజ్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ

image

కౌశల్-2025 క్విజ్ పోటీల పోస్టర్‌ను డీఈవో బాలాజీ రావు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో చదువుతున్న 8, 9, 10 తరగతుల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులకు నవంబర్ 1 నుంచి పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలో భారతీయుల కృషి’ అనే అంశాలపై క్విజ్ నిర్వహిస్తామన్నారు.

News October 15, 2025

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్‌లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.