News September 12, 2024
‘ఆ లక్ష్యం సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలి’

కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.
Similar News
News October 23, 2025
నల్గొండ: తండ్రి మందలించాడని సూసైడ్

చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన యువకుడు రుద్రారపు చందు (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చందు ట్రాక్టర్ మెకానిక్. ప్రతిరోజు చిట్యాలకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. దీంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. పెద్దకాపర్తి సబ్ స్టేషన్ వద్ద పడి ఉండగా ఆసుపత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందాడు.
News October 23, 2025
MLG: 500 ఓటర్లున్నా జనాబాలో జీరో చూపిస్తోంది: స్థానికులు

జంకుతండ గ్రామ పంచాయతీలో 200కు పైగా ఎస్సీ కుటుంబాలు, 500కు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క వార్డు సభ్యుడి స్థానం కూడా కేటాయించలేదని స్థానికులు తెలిపారు. 2011 జనాభా లెక్కల్లో ఎస్సీ జనాభాను ‘జీరో’గా చూపించారు. ఈ మేరకు ఎస్సీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగరాజు, భరత్, సోమయ్య పాల్గొన్నారు.
News October 23, 2025
మిర్యాలగూడ: డీసీఎంలోనే గుండెపోటుతో డ్రైవర్ మృతి

గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన జనగామ(D) దేవరుప్పుల(M) కామారెడ్డిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన వెంకన్న జనగామలో పత్తి అన్లోడ్ చేసి తిరిగి మిర్యాలగూడ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు డీసీఎం ఆన్లో ఉండగా స్థానికులకు డౌట్ వచ్చి గమనించడంతో ఈ విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు.