News August 20, 2024

ఆ లోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు: మంత్రి కొలుసు

image

మార్చిలోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు అవుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం కంకిపాడులో గృహ నిర్మాణ సామగ్రి, నిల్వ గోదాంను ఆయన సందర్శించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 16, 2025

MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం : DRO

image

పట్టభద్రుల MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం అని కృష్ణాజిల్లా సహాయ ఎన్నికల అధికారి, DRO కె చంద్రశేఖరరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన వారికి శనివారం కలెక్టరేట్‌లో వారి విధులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.

News February 15, 2025

పెనమలూరు: ఆన్‌లైన్‌లో రూ.1.55 లక్షల స్వాహా

image

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్‌కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

News February 15, 2025

గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

image

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్‌ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

error: Content is protected !!