News September 22, 2024

ఆ వాహనాలకు బీమా సెటిల్‌మెంట్ పూర్తి చేయండి: సీఎం

image

విజయవాడ వరదలలో వాహనాలకు జరిగిన నష్టానికి బీమా సెటిల్‌మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 10 వేల వాహనాలలో 6 వేల వాహనాలకు బీమా సెటిల్‌మెంట్ పూర్తైందని అధికారులు సీఎంకు శనివారం జరిగిన సమీక్షలో తెలిపారు. మిగతా 4 వేల వాహనాలకు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయాలని చంద్రబాబు సూచించారు.

Similar News

News December 21, 2025

ప్రకృతి వ్యవసాయంతోనే స్థిర ఆదాయం: కలెక్టర్‌

image

రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపినప్పుడే స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్‌ బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పినగూడూరు లంకలోని అభ్యుదయ రైతు మేకపోతుల విజయరామ్‌ గురూజీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. పాడి ఆవుల ద్వారా కేవలం పాలు అమ్మడమే కాకుండా, గోమయం, గోమూత్రంతో పూజా సామాగ్రి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలు గడించవచ్చని ఆయన అన్నారు.

News December 21, 2025

మచిలీపట్నం-అజ్మీర్‌ స్పెషల్ ట్రైన్ ప్రారంభం

image

మచిలీపట్నం-అజ్మీర్‌ ప్రత్యేక రైలును ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆదివారం ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఆయన తనయుడు పునీత్‌ ఇనగుదురుపేట జెండా సెంటర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చాదర్‌ను ర్యాలీగా రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చి అజ్మీర్‌కు పంపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

News December 21, 2025

కృష్ణా: మళ్లీ బీసీ వర్గానికి టీడీపీ జిల్లా పీఠం

image

టీడీపీ కృష్ణా జిల్లా పీఠం మరోసారి BC వర్గాలకే దక్కింది. BC (గౌడ) వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలు కూడా BC వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణరావులే TDP జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గురుమూర్తి నాయకత్వంలో కూడా పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.