News June 21, 2024
ఆ వైసీపీ కార్యాలయాలను కూల్చివేయాలి: విశాఖ కార్పొరేటర్

విశాఖ నగరం ఎండాడ, అనకాపల్లి జిల్లా రాజుపేటలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనాలను చట్టపరంగా కూల్చివేయాలని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేశ్కు వినతి పత్రం అందజేశారు. విశాఖలో కార్యాలయ స్థలానికి ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 అద్దె చెల్లించడానికి 33ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.
News October 27, 2025
విశాఖ: మొంథా తుఫాన్.. జాగ్రత్తగా ఉండండి

తుఫాన్ నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 0891- 2590102, 0891- 2590100 ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు నిషేధించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు.
News October 27, 2025
విశాఖలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ సీఐ ఉమా మహేశ్వరరావు రౌడీ షీటర్లకు సత్ప్రవర్తనతో మెలగాలని, నిత్యం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో తలదూర్చకుండా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.


