News April 15, 2025

ఆ 4 ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి నారాయణ

image

మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం నారాయణ అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదించిన అదనపు భూసేకరణపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని.. సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారన్నారు.

Similar News

News January 8, 2026

10pmకు రాజాసాబ్ ప్రీమియర్ షో.. అయితే!

image

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌పై ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. రాత్రి 10 గంటలకు బాలానగర్ విమల్ థియేటర్‌లో షో వేయనున్నారు. దీనికి కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నారు. అటు ఏపీలో మాత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతున్నాయి.

News January 8, 2026

WGL: ‘స్ట్రామ్ వాటర్ డ్రైన్లను ప్రతిపాదించాలి’

image

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో రూ.4170 కోట్లతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సమాంతరంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్లను ప్రతిపాదించాలని MLAలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపై గురువారం జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌ పాయ్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి డీపీఆర్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో బల్దియా ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

News January 8, 2026

PDPL: ‘RBSK సిబ్బంది సమయపాలన పాటించాలి’

image

DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ గురువారం RBSK డాక్టర్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. RBSK డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి, రిఫరల్ కేసులు పెంచాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. డా. శ్రీరాములు, డా. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.