News April 16, 2025
ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

YCP నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. పొదలకూరు(M) వరదాపురం వద్ద రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వి రూ.250కోట్లు దోచేసిన కేసులో 13 మందిపై కేసులు నమోదు చేశారు. కాకాణి A4గా ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో 7బృందాలతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
Similar News
News October 28, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 28, 2025
శ్రీహరికోట: షార్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11.
News October 28, 2025
నెల్లూరులో విద్యార్థుల మిస్సింగ్.. గూడూరులో ప్రత్యక్షం

ధనలక్ష్మిపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న రాకేష్, లోకేష్ ఈ నెల 23న అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. వారిద్దరూ గూడూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లిన ఆ ఇద్దరు విద్యార్థులు గూడూరులో ఉండగా.. సాంకేతికత ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు.


