News February 2, 2025

ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి సిద్దిపేట విద్యార్థులు

image

దుబాయ్‌లో ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ(U-19)కి సిద్దిపేటకు చెందిన పవనసుత హనుమాన్, లక్ష్మి మణికాంత్ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులు, క్రికెట్ అకాడమీ కోచ్ ముత్యాల ఆనంద్‌ను శనివారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్‌లో విజయాలను సాధించాలన్నారు.

Similar News

News February 16, 2025

బుమ్రా లేకపోయినా భారతే ఫేవరెట్: మైఖేల్ క్లార్క్

image

ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కావడం భారత్‌కు లోటేనని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చెప్పారు. అయితే జట్టు బలంగా ఉందని, బుమ్రా లేకపోయినా ఇండియానే ఫేవరెట్ అని అభిప్రాయపడ్డారు. టాప్-4లో భారత్ కచ్చితంగా ఉంటుందన్నారు. ‘గిల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ ఇటీవలే సెంచరీ చేశారు. ఇక హార్దిక్ పాండ్య ఒక సూపర్ స్టార్. అతను జట్టుకు X-ఫ్యాక్టర్ అవుతారు’ అని పేర్కొన్నారు.

News February 16, 2025

శ్రీశైలం విశిష్టత మీకు తెలుసా…!

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలక్షేత్రం <<15471616>>రెండోది<<>>. ఈ మందిరంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కుమారస్వామిని వెతకడానికి క్రౌంచ పర్వతం (శ్రీశైలం) వెళ్లిన శివుడు ఆయన ఉన్నచోటనే లింగరూపంలో వెలిశారు. అక్కడ మద్ది చెట్టుకు మల్లెతీగ అద్దుకొని ఉందట. అప్పటినుంచి స్వామి వారికి ‘మల్లికార్జునుడు’ అని పేరొచ్చిందని స్థలపురాణం పేర్కొంటుంది.

News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!