News February 14, 2025
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్

జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 12, 2025
నడిగూడెం: నాటి తొలి బోర్డు హైస్కూల్- నేటి జడ్పీ స్కూల్

నడిగూడెంలో కొల్లు పాపయ్య చౌదరి విరాళంతో 1950లో 4 ఎకరాల్లో ఉన్నత పాఠశాల నిర్మించారు. అప్పట్లో ఉమ్మడి ఏపీ కృష్ణా జిల్లాలో ఇదే మొదటి బోర్డు హైస్కూల్గా గుర్తింపు పొందింది. కోదాడ, సూర్యాపేట నుంచి విద్యార్థులు వచ్చి హెచ్ఎస్ఎల్సీ వరకు ఇక్కడ చదివేవారు. దూర ప్రాంత విద్యార్థుల కోసం వసతి గృహాన్ని కూడా నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఇది జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలగా కొనసాగుతోంది.
News November 12, 2025
వరంగల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు..!

WGL ఎనుమాముల మార్కెట్లో బుధవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు మంగళవారం రూ.18,200 ధర రాగా.. నేడు రూ.18,300 అయింది. వండర్ హాట్ (WH) మిర్చి నిన్నటి లాగే రూ.17,500 పలికింది. తేజ మిర్చికి కూడా నిన్నటి లాగే ఇవాళ రూ.14,900 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి నిన్న రూ.15 వేలు పలకగా ఈరోజు రూ.15,500 పలికింది.
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.


