News February 14, 2025

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్

image

జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్‌లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్‌లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News November 15, 2025

గత 6ఏళ్లలో FDIల సాధనలో AP వెనుకబాటు

image

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ సాధనలో 2019 OCT-2025 JUN మధ్య కాలంలో AP బాగా వెనుకబడింది. ఆ కాలంలో $1.27B FDIలతో ఏపీ 14వ స్థానానికి పరిమితమైంది. దేశ FDIలలో ఏపీ వాటా 0.2%-0.7% కాగా కర్ణాటక 14%-28% TN 3.7%-10% దక్కించుకున్నట్లు బిజినెస్ టుడే పేర్కొంది. 2025 జూన్‌ క్వార్టర్లో AP $307 M, కర్ణాటక $10 B, TG $2.3 B FDIలు సాధించాయి. కాగా VSP CII సమ్మిట్‌లో వచ్చిన 13L CR పెట్టుబడుల్లో FDIలూ ఉన్నాయి.

News November 15, 2025

గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలి: SP

image

బాపట్ల జిల్లాకు వస్తున్న గవర్నర్ పర్యటనకు పటిష్ఠ భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. సూర్యలంక వద్ద గవర్నర్ పర్యటించనున్న ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, తిరిగి వెళ్లే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు.

News November 15, 2025

నిర్మల్: రేపటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

image

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లెర్నింగ్ సెంటర్(103)లో 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ M.సుధాకర్, కోఆర్డినేటర్ U.గంగాధర్ తెలిపారు. డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించి 1, 3&5 సెమిస్టర్ తరగతులు ఉంటాయన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని కావాలన్నారు.