News February 14, 2025
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్

జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News November 15, 2025
ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.
News November 15, 2025
భద్రకాళి చెరువులో అద్దాల వంతెన!

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఒక కొత్త అనుభూతి రానుంది. భద్రకాళి చెరువు మధ్యలో ఏర్పాటు చేసే ఐలాండ్ నుంచి చెరువు బండ్ వరకు అద్దాల వంతెన ఏర్పాటుకు అడుగు పడింది. కిలో మీటర్ రోప్ వే, 250 మీటర్ల అద్దాల వంతెన కోసం పలు సంస్థలు శుక్రవారం ప్రజెంటేషన్లు ఇచ్చాయి.దాదాపు రూ.70 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని కుడా అధికారులు భావిస్తున్నారు. దీంతో WGL పర్యాటకానికి కొత్త పుంత రానుంది.
News November 15, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(<


