News April 12, 2025
ఇంటర్లో ఫలితాల్లో పల్నాడు జిల్లాకు 23వ స్థానం

రాష్ట్ర స్థాయిలో ఇంటర్ పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి పల్నాడు జిల్లా 23వ స్థానంలో నిలిచింది. వివరాలను జిల్లా అధికారి నీలావతి దేవి శనివారం వివరించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలలో 40% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 23వ స్థానంతో పల్నాడు జిల్లా సరిపెట్టుకుంది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 71% ఉత్తీర్ణతతో 9వ స్థానాన్ని సాధించిందన్నారు.
Similar News
News April 20, 2025
ఎమ్మెస్ రామారావును కడప జిల్లా వాసులు మరచిపోలేరు

ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి.
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News April 20, 2025
రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల

జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్లో జరిగే డీఆర్సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.