News January 27, 2025
ఇంటర్ ఎగ్జామ్స్: మేడ్చల్ జిల్లాలో 1,26,423 విద్యార్థులు

మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఇంటర్లో మొత్తం 1,26,423 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తన ఛాంబర్లో సమావేశంలో నిర్వహించారు. పరీక్ష విధి విధానాలు, చర్యలపై చర్చించారు.
Similar News
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
NGKL: గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈనెల 26, లేదంటే 27 తేదీలలో వెలువడే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ రావలసి ఉంది. జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంచకుండా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు.
News November 23, 2025
తూ.గో: భార్యాభర్తల ఘర్షణ.. అడ్డొచ్చిన మామ మృతి

భార్యాభర్తల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎర్రకొండలో అల్లుడి చేతిలో మామ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సీఐ టి.గణేషశ్ వివరాల ప్రకారం.. శ్రీనివాస్ తన భార్య నాగమణితో గొడవ పడుతుండగా, ఆమె తండ్రి అప్పలరాజు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ బలంగా తోసేయడంతో సిమెంట్ రోడ్డుపై పడి అప్పలరాజు తలకు తీవ్ర గాయమై మృతి చెందారు. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


