News January 27, 2025

ఇంటర్ ఎగ్జామ్స్: మేడ్చల్ జిల్లాలో 1,26,423 విద్యార్థులు

image

మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఇంటర్‌లో మొత్తం 1,26,423 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తన ఛాంబర్‌లో సమావేశంలో నిర్వహించారు. పరీక్ష విధి విధానాలు, చర్యలపై చర్చించారు.

Similar News

News December 3, 2025

కాకినాడ: వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. ‘ఆ లక్షణాలు కనిపిస్తే డేంజరే…’

image

కాకినాడ జిల్లాను స్క్రబ్ టైఫస్ పంజా విసురుతోంది. జనం వణికిపోతున్నారు. మంగళవారం సాయంత్రానికి 142 కేసులు నమోదైనట్లు DMHO నరసింహనాయక్ తెలిపారు. ఈ పరీక్షలు చేసేందుకు గ్రామాలలో వెసులుబాటు లేదు. ఎవరైనా జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడితే నేరుగా PHCకి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. అక్కడ వైద్యులు పరీక్షించి నిర్ధారణ కోసం కాకినాడ GGHకి తరలిస్తున్నారు. మారుమూల గ్రామాలలో ఈ వైరస్ విసిరిస్తోందని DMHO తెలిపారు.

News December 3, 2025

‘సంచార్ సాథీ’పై వెనక్కి తగ్గిన కేంద్రం

image

సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైళ్లలో ప్రీ <<18439451>>ఇన్‌స్టాలేషన్<<>> తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సాథీ యాప్‌ను అన్ని కొత్త మొబైళ్లలో ప్రీ ఇన్‌స్టాలేషన్ చేస్తామన్న కేంద్రం ప్రకటనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్ తెస్తోందని, ఇది ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో యాప్ ప్రీ ఇన్‌స్టాలేషన్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది.

News December 3, 2025

ఎచ్చెర్ల: లా కోర్సు మిగులు సీట్లు భర్తీ వాయిదా

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల లా కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం డిసెంబర్ 4 న చేపట్టనున్న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ అడ్డయ్య ప్రకటన విడుదల చేశారు. లా కోర్సు స్పాట్ అడ్మిషన్స్లో భాగంగా గురువారం విద్యార్థుల సర్టీఫికేట్ల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం తదుపరి తేదీ ప్రకటించే పరిశీలనను వాయిదా వేస్తున్నామన్నారు.