News February 26, 2026
ఇంటర్ ఎగ్జామ్స్: వరంగల్ జిల్లాలో ముగ్గురు డిబార్

వరంగల్ జిల్లా పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెంటర్లో 191 మందికి 188 మంది హాజరయ్యారు. మోడల్ స్కూల్ సెంటర్లో 177 మంది విద్యార్థులకు గాను 174 పరీక్ష రాశారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థుల చొప్పున ఆబ్సెంట్ అయ్యారు.
Similar News
News April 16, 2026
GNT: మాస్టర్ మైండ్స్ సత్తా.. టాప్ ఫలితాలు

జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ కళాశాల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. జూనియర్ ఇంటర్లో ఐదుగురు 496 మార్కులు సాధించగా, 320 మందికి పైగా 490 పైన మార్కులు సాధించడం విశేషం. సీనియర్ MEC విభాగంలో గీతిక 984 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సంస్థ క్రమశిక్షణ, నాణ్యమైన బోధనే ఈ విజయాలకు కారణమని యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
News April 16, 2026
GNT: మాస్టర్ మైండ్స్ సత్తా.. టాప్ ఫలితాలు

జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ కళాశాల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. జూనియర్ ఇంటర్లో ఐదుగురు 496 మార్కులు సాధించగా, 320 మందికి పైగా 490 పైన మార్కులు సాధించడం విశేషం. సీనియర్ MEC విభాగంలో గీతిక 984 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సంస్థ క్రమశిక్షణ, నాణ్యమైన బోధనే ఈ విజయాలకు కారణమని యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
News April 16, 2026
బ్యాంకర్లకు తిరుపతి ఎస్పీ సూచనలు

సైబర్ మోసాల కట్టడి నిమిత్తం పోలీసులు, బ్యాంకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. డిజిటల్ అరెస్ట్, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, OTP మోసాలపై బ్యాంకర్లకు అవగాహన కల్పించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించాలని సూచించారు. ఇంటర్నేషనల్ కాల్స్ ద్వారా జరిగే బ్యాంక్ ఫ్రాడ్లపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


