News February 25, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఐఈఓ పరుశురాం

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల్లో మొత్తం 13,125 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 6,652 మంది ఉన్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.

Similar News

News April 18, 2026

గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

image

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.

News April 18, 2026

భాగ్యనగరానికి తలమానికం.. మన చార్మినార్

image

450 సంవత్సరాల క్రితం నిర్మితమైన సుందరమైన కట్టడం చార్మినార్. భాగ్యనగరానికి ఇది అమూల్యమైన వారసత్వ సంపద. ఈ కట్టడం నాలుగు శతాబ్దాలుగా ఇండో- ఇస్లామిక్ శిల్పకళా వైభవానికి, మతసామరస్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మన సంస్కృతికి ప్రత్యేకగా నిలిచిన ఈ చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మన వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. # నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.

News April 18, 2026

BHPL: కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహుల ఎదురుచూపు!

image

గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లో కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. కానీ ఎన్నికలు ముగిసి 3 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం లేదని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.