News February 3, 2025
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ లకు డీటీలకు కేటాయించాలని ఆదేశించారు.
Similar News
News February 4, 2025
కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News February 4, 2025
సంగారెడ్డి: ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు
సంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు ఐదు రోజుల సీసీఎల్ మంజూరు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సాధారణ సెలవు దినాల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇవి వర్తిస్తాయన్నారు. దీంతో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 4, 2025
‘తిల్లు ముల్లు’లా సూర్య, శాంసన్ తీరు: అశ్విన్
ENGతో T20 సిరీస్లో విఫలమైన సూర్య, శాంసన్ ఆట తీరుపై అశ్విన్ స్పందించారు. ‘తిల్లు ముల్లు అనే మూవీలో రజినీకాంత్ 2 పాత్రలు పోషిస్తారు. మీసంతో ఒకటి, లేకుండా మరో క్యారెక్టర్లో ఉంటారు. సంజూ, సూర్యలను చూస్తుంటే అలాగే ఉంది. 5మ్యాచ్లలో ఒకే రకమైన బాల్, షాట్కు ఔట్ అయ్యారు. సూర్య తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలి. మనసులో అనేక ఆలోచనలతో సంజూ ఉన్నారు. ఇలా ఉంటే బ్యాటింగ్ చేయడం కష్టం’ అని పేర్కొన్నారు.