News March 2, 2025
ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News October 14, 2025
రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

RR జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
News October 14, 2025
రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. రికీ భుయ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.
News October 14, 2025
HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్ఛార్జుల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్ఛార్జ్గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్ఛార్జ్గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్కు అందజేయాలని ఆదేశించారు.