News March 2, 2025
ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News July 11, 2025
MDK: వర్షాల కోసం ఎదురుచూపులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగాలు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులైనా సరైన వర్షాలు లేక అన్నదాత ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల తొలకరి జల్లులకు వేసిన పంటలు ఎండిపోతాయని కొందరు ఆవేదన చెందుతుండగా మరికొందరు వానదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 16.14 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు అంచనా వేయగా కేవలం 6.88 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
News July 11, 2025
గుంటూరు: రైస్ కార్డులకు దరఖాస్తుల వెల్లువ

రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
News July 11, 2025
‘బాహుబలి ది ఎపిక్’ రన్టైమ్ 5.27 గంటలు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకే మూవీగా ‘బాహుబలి ది ఎపిక్’గా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్టైమ్ రివీలైంది. దాదాపు 5 గంటల 27నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈక్రమంలో దీనిపై ‘బాహుబలి’ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPL మ్యాచుకు సమానం’ అని రాసుకొచ్చింది.