News April 12, 2025
ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థిని

తెనాలికి చెందిన షేక్ షీఫా ఫిర్డోస్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షల్లో 1000కి 991 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. అత్యుత్తమ ఫలితాలతో ప్రతిభను చాటిన షీఫా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కీర్తి తీసుకువచ్చింది. చదువులో ఆమె నిబద్ధత, కష్టపడి పనిచేసే ధోరణి ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తన ప్రతిభతో తెనాలికి గర్వకారణంగా నిలిచింది.
Similar News
News October 31, 2025
కొండాపూర్ కల్వర్టు మరమ్మతు పూర్తి చేయాలి: కలెక్టర్

కోనరావుపేట మండలంలోని కొండాపూర్ శివారులో పెంటివాగు ప్రవహించడంతో దెబ్బతిన్న లో లెవెల్ కల్వర్టును ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం పరిశీలించారు. కల్వర్టుకు పక్కాగా మరమ్మతులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఆమె ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మరమ్మతులు వేగవంతం చేసి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ సూచించారు.
News October 31, 2025
కోనరావుపేట: ‘రైస్ మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలి’

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో వెంటనే అన్లోడ్ చేసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మల్కపేటలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల కుప్పలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండి, అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.


