News March 5, 2025

ఇంటర్ పరీక్ష వేళ పరిసరాల జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: సీపీ

image

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలెటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News November 27, 2025

WGL: పంచాయతీ ఎన్నికలు.. బ్యాంకులకు అభ్యర్థుల పరుగులు..!

image

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు నూతన బ్యాంకు ఖాతాలు కావాలని ఎలక్షన్ కమిషన్ నిబంధన విధించడంతో అభ్యర్థులు ఆయా బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి WGL జిల్లాలోని మండల కేంద్రాల్లో రెండు, మూడు బ్యాంకులకు చెందిన శాఖలు ఉండగా, వాటిల్లో ఇదివరకే అభ్యర్థులకు ఖాతాలు ఉన్నాయి. కాగా, మళ్లీ ఖాతా కావాలంటే బ్యాంకర్లు ఇవ్వడం లేదు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

News November 27, 2025

KMR: పీహెచ్సీ వైద్యాధికారులతో డీఎంహెచ్వో సమీక్ష

image

కామారెడ్డి కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో డీఎంహెచ్వో డా.విద్య సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు వివరాలను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరుపై సమీక్షించారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు సమయానుసారంగా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News November 27, 2025

HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

image

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.