News September 30, 2024

ఇంటర్ ప్రవేశాల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు

image

2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వనపర్తి డిఐఈఓ అంజయ్య ఆదివారం తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రూ.500 జరిమానాతో, ప్రభుత్వ కళాశాలలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ఇంటర్ లోప్రవేశం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని అన్నారు.

Similar News

News November 30, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో 15.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 15.9 డిగ్రీలు, బాలానగర్‌లో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.

News November 30, 2025

MBNR: ఇసుక ట్రాక్టర్ బోల్తా.. బాలుడి మృతి

image

మిడ్జిల్ మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి శ్రీశాంత్ (17)మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. దుందుభి వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా, కేఎల్ఐ కాలువ సమీపంలో ట్రాక్టర్ వరి ధాన్యం కుప్పను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 29, 2025

MBNR: పీయూలో కొత్త కాంటీన్‌ను ప్రారంభించనున్న వీసీ

image

PU విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ క్యాంటీన్‌ను డిసెంబర్ 1న వైస్ ఛ ఛ ఛాన్స్‌లర్(వీసీ) ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార వసతులను అందించేందుకు ఈ నూతన కాంటీన్‌ను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కంట్రోలర్, ప్రిన్సిపాల్స్, విభాగ అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హాజరు కావాలని రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేష్ బాబు తెలిపారు.