News April 12, 2025

ఇంటర్ ఫలితాలు.. పార్వతీపురం జిల్లా స్టేట్ ఫస్ట్

image

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఫస్ట్ ఇయర్ 70% ఉత్తీర్ణత సాధిస్తే, సెకండ్ ఇయర్ 81% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కనబరచడంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామని ఇంటర్ విద్యాధికారిని మంజుల వీణ తెలిపారు.

Similar News

News November 14, 2025

మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ జానకి

image

నిర్మల్ జిల్లాలో మహిళల భద్రతకు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహిళా రక్షణ కోసం షీ టీం బృందం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. మహిళలపై వేధింపులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఆకతాయిలను ఎక్కడైనా గమనించినా వెంటనే డయల్ 100కు లేదా షీ టీం పోలీసులకు 8712659550 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

News November 14, 2025

రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి బాలలదే: కలెక్టర్

image

రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి బాలలపై ఆధారపడి ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ‘2047 రైసింగ్ తెలంగాణ’ విజన్​లో పిల్లల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. 0-18 ఏళ్ల వయసు ఉన్న వారందరూ పిల్లలుగా పరిగణించబడతారని, పిల్లల రాజ్యాంగం వారికి చట్టపరమైన హక్కులను కల్పించిందని, బాలలు ఈ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

News November 14, 2025

HYD: 3ఏళ్లకే రికార్డులు కొల్లగొడుతున్న కార్తీక్ సూర్య

image

వనస్థలిపురంలోని IT ఉద్యోగి ప్రశాంత్, నీరజ కొడుకు కార్తీక్ సూర్య(3)కు 16 నెలల వరకు మాటే రాలే. 3 ఏళ్ల వయసులో అంకెలు గుర్తించి తల్లిని అడిగి తెలుసుకునేవాడు. వారి పెంపకంలో రోజుల వ్యవధిలోనే పెద్ద అంకెలతో కూడిక, తీసివేత, శాతాలు చేయడం మొదలెట్టాడు. కఠిన పదాలకు క్షణాల్లో నోటితోనే కచ్చితమైన సమాధానం చెప్తాడు. ఇండియా, నోబుల్, కిడ్స్, తెలంగాణ, తెలుగు, వరల్డ్ వైడ్, కలాం వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.