News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో ఒకేషనల్ విద్యార్థుల సత్తా

image

INTER ఫలితాల్లో కుప్పం GOVT. ఒకేషనల్ JR కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. 500 మార్కులకుగాను అనూష 497 స్కోర్ సాధించి టాపర్‌గా నిలిచింది. అభినయశ్రీ 495 భవ్యశ్రీ 494 స్కోర్‌తో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ జ్యోతి స్వరణ్ తెలిపారు.

Similar News

News April 17, 2025

CTR: మీరు ఇలా చేయకండి

image

చిత్తూరు సంతపేటలో బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజా ‘defabet sports’ యాప్‌లో బెట్టింగ్ స్టార్ట్ చేశాడు. లాభాలు రావడంతో ఆశపడి భార్య నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బును యాప్‌లో పెట్టి పోగొట్టాడు. వారం వ్యవధిలోనే నాలుగైదు రూ.లక్షలు నష్టపోయాడు. ఎక్కడైనా బెట్టింగ్ జరిగినట్లు తెలిస్తే చిత్తూరు పోలీసుల వాట్సాప్ నంబరు 9440900005కు సమాచారం ఇవ్వాలని SP మణికంఠ  సూచించారు.

News April 17, 2025

పార్టీలో చిత్తూరు ఎంపీకి మరో పదవి 

image

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావుకు పార్టీలో మరో కీలక పదవి  దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీని నియమించారు. ఈ కమిటీలో చిత్తూరు ఎంపీని మెంబర్‌గా అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు ఎంపీ దగ్గుమళ్ల ధన్యవాదములు తెలిపారు.

News April 17, 2025

అమెరికాలో చంద్రగిరి వాసికి మంత్రి పదవి

image

అగ్రరాజ్యం అమెరికాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసికి కీలక పదవి లభించింది. చంద్రగిరికి చెందిన టీడీపీ మహిళా నేత లంకెళ్ల లలిత, శ్రీరాముల కుమారుడు బద్రి 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడి విస్కాన్ సిన్ స్టేట్‌లోని మాడిసన్ డిస్ట్రిక్ట్-7లో అల్డర్ పర్సన్‌గా 53.8 శాతం ఓట్లతో గెలిచారు. తాజాగా ఆయన నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

error: Content is protected !!