News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో ఒకేషనల్ విద్యార్థుల సత్తా

INTER ఫలితాల్లో కుప్పం GOVT. ఒకేషనల్ JR కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. 500 మార్కులకుగాను అనూష 497 స్కోర్ సాధించి టాపర్గా నిలిచింది. అభినయశ్రీ 495 భవ్యశ్రీ 494 స్కోర్తో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ జ్యోతి స్వరణ్ తెలిపారు.
Similar News
News April 17, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో జేసీ విధ్యాదరితో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి MROలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యూట్యుయేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జీవో నంబర్.30 ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ అంశాలను పరిశీలించాలన్నారు.
News April 17, 2025
చిత్తూరు: ఈనెల 20 వరకు రేషన్ పంపిణీ

చిత్తూరు జిల్లాలో రేషన్ పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అధిక శాతం మంది కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 17, 2025
CTR: మీరు ఇలా చేయకండి

చిత్తూరు సంతపేటలో బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజా ‘defabet sports’ యాప్లో బెట్టింగ్ స్టార్ట్ చేశాడు. లాభాలు రావడంతో ఆశపడి భార్య నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బును యాప్లో పెట్టి పోగొట్టాడు. వారం వ్యవధిలోనే నాలుగైదు రూ.లక్షలు నష్టపోయాడు. ఎక్కడైనా బెట్టింగ్ జరిగినట్లు తెలిస్తే చిత్తూరు పోలీసుల వాట్సాప్ నంబరు 9440900005కు సమాచారం ఇవ్వాలని SP మణికంఠ సూచించారు.