News April 12, 2024
ఇంటర్ ఫలితాల్లో కర్నూల్, నంద్యాల జిల్లా స్థానాలు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కర్నూల్ జిల్లా 68% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వ స్థానంలో, నంద్యాల 59% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 19818 మందికి 13394 మంది.. నంద్యాలలో 12022 మందికి 7102 మంది పాసయ్యారు. సెకండియర్లో కర్నూల్ 76% ఉత్తీర్ణతతో 12వ స్థానం, నంద్యాల జిల్లా 70% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 17294 మందికి 13210 మంది, నంద్యాలలో 9165 మందికి 6429 మంది పాసయ్యారు.
Similar News
News March 15, 2025
కర్నూలు జిల్లాలో 393 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షకు 393 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు.19,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 393 విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆర్ఐఓ స్పష్టం చేశారు.
News March 15, 2025
కర్నూలులో హత్య.. పాత కక్షలే కారణమా?

కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్నగర్లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 15, 2025
కర్నూలులో టీడీపీ నాయకుడి దారుణ హత్య

కర్నూలులో దారుణ హత్య జరిగింది. నగరంలోని షరీఫ్ నగర్కు చెందిన కార్పొరేటర్ జయన్న తండ్రి సంజన్నను గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. 2024లో టీడీపీలో చేరిన ఆయన బైరెర్డి వర్గీయుడిగా ఉన్నారు. అయితే స్థానికంగా అంజన్నతో మృతుడికి ఆధిపత్యపోరు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.