News April 12, 2025
ఇంటర్ ఫలితాల్లో పిడుగురాళ్ల విద్యార్థికి 978 మార్కులు

పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. శనివారం విడుదల చేసిన సెకండియర్ ఫలితాల్లో యశ్వంత్ అనే విద్యార్థికి 978 మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థి పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తండ్రి కూలీ పని చేస్తుంటాడు. అనంతరం అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆ విద్యార్థిని అభినందించారు.
Similar News
News November 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 19, 2025
AIని గుడ్డిగా నమ్మవద్దు: సుందర్ పిచాయ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. AI కూడా తప్పులు చేసే అవకాశం ఉందని, ఇతర టూల్స్లో సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని చెప్పారు. విభిన్న మాధ్యమాలతో కూడిన సమాచార వ్యవస్థ ఉండటం ముఖ్యమని తెలిపారు. ఏఐ పెట్టుబడుల ‘బబుల్’ ఏ దశలోనైనా విస్ఫోటనం చెందవచ్చని, ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని BBC ఇంటర్వ్యూలో సూచించారు.
News November 19, 2025
మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..!?

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


