News April 12, 2025
ఇంటర్ ఫలితాల్లో పిడుగురాళ్ల విద్యార్థికి 978 మార్కులు

పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. శనివారం విడుదల చేసిన సెకండియర్ ఫలితాల్లో యశ్వంత్ అనే విద్యార్థికి 978 మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థి పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తండ్రి కూలీ పని చేస్తుంటాడు. అనంతరం అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆ విద్యార్థిని అభినందించారు.
Similar News
News November 17, 2025
వరంగల్: నేడు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు బంద్

సీసీఐ నిబంధనల పట్ల ఆందోళనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిన్నింగ్ మిల్లర్లు నేడు పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. మిల్లులను ఎల్1, ఎల్2 కేటగిరీలుగా విభజించడం, తక్కువ పరిమాణంలోనే కొనుగోలు అనుమతించడం వల్ల మిల్లర్లకు నష్టం జరుగుతోందని అసోసియేషన్ తెలిపింది. అకాల వర్షాలతో దిగుబడి పడిపోయిన రైతులు మళ్లీ కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 17, 2025
HYD: మహిళలు.. దీనిని అశ్రద్ధ చేయకండి

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని HYD MNJ వైద్యులు తెలిపారు. రొమ్ములో కణతి చేతికి తగలడం, చనుమొన నుంచి రక్తం, ఇతర స్రవాలు కారటం, చొట్టబడి లోపలికి పోవడం, ఆకృతిలో మార్పు, గజ్జల్లో వాపు లాంటివి కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు దాటిన మహిళ మామోగ్రామ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం మంచిదని MNJ ప్రొ.రఘునాథ్రావు తెలిపారు.
News November 17, 2025
JGTL: నేడే క్యాబినెట్ భేటీ.. రిజర్వేషన్ల పంచాయితీ తేలేనా..?

బీసీ రిజర్వేషన్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర క్యాబినెట్ భేటీ నేడు జరగనుండగా, ఎన్నికలపై ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. రోజులు గడిచేకొద్దీ ఎన్నికలు ఎప్పుడూ జరుగుతాయోనని ఆశావహులంతా ఎదురుచూస్తున్నారు. కనీసం నేటితోనైనా ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి. కాగా ఉమ్మడి జిల్లాలో 1216 GPలు, 60 ZPTCలు, 646 MPTC స్థానాలున్నాయి.


