News February 19, 2025
ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్కు నిర్మల్ కలెక్టర్ స్వాగతం

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల సేకరణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.
Similar News
News November 11, 2025
HNK: ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి తెలిపారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి, నడికూడ మండలాల్లో తాత్కాలిక నియామకాలు చేపడతారు. ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News November 11, 2025
కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం

కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకున్న తల్లిని కత్తితో పొడిచిన ఘటన MHBD జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సింహులపేట(M) కొమ్ములవంచ గ్రామంలో బూరుగండ్ల రవికి పారునంది అర్జున్లకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో రవిని కత్తితో అర్జున్ను పొడుస్తుండగా అడ్డుకోబోయిన అతడి తల్లి సునీతను చేయి దగ్గర పొడిచాడు. వారిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.


