News February 19, 2025
ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్కు నిర్మల్ కలెక్టర్ స్వాగతం

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల సేకరణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.
Similar News
News December 20, 2025
సంగారెడ్డి: ’21వ తేదీన జాతీయ లోక్ అదాలత్’

సుప్రీంకోర్ట్ ఉత్తర్వుల మేరకు ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర శుక్రవారం తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ కోర్టులలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజలు, కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News December 20, 2025
బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డ్

జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శుక్రవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అందుకున్నారు. కొందరు పర్యాటక శాఖకు చెందిన వెబ్ సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కేసులను సమర్థవంతంగా చేదించినందుకు డీజీపీ అవార్డును అందించినట్లు వివరించారు.
News December 20, 2025
నిర్మల్ జిల్లాలో రూ.14,67,700 సీజ్: ఎస్పీ

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా సరిహద్దుల్లోని 12 చెక్పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.14,67,700 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగదుతో పాటు రూ.7లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన 150 కేసుల్లో 201 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.


