News March 5, 2025
ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి: మంత్రి సీతక్క

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే విద్యార్థులు గురి పెట్టి ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 23, 2025
TG సిఫారసు లేఖలపై రేపటి నుంచి శ్రీవారి దర్శనం

TG ప్రజాప్రతినిధుల <<15790945>>సిఫారసు లేఖలపై<<>> తిరుమల శ్రీవారి దర్శనం రేపటి నుంచి అమలు కానుంది. సోమ, మంగళవారాల్లో VIP బ్రేక్, బుధ, గురువారాల్లో ₹300 స్పెషల్ దర్శనాలు ఉంటాయి. AP సిఫారసు లేఖలపై MONకి బదులు ఆదివారం దర్శనాలకు అనుమతిస్తారు. కాగా ఈనెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. 24, 29 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోబోమని తెలిపింది.
News March 23, 2025
స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.
News March 23, 2025
అట్లీ సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్?

తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సినిమాలో మెయిన్ విలన్ పాత్ర అదేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘పుష్ప’ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలోనూ కొంతవరకు నెగటివ్ షేడ్స్ ఉన్న సంగతి తెలిసిందే.