News June 18, 2024

ఇంటర్ సప్లిమెంటరీలో ప్రకాశం జిల్లాకు 12వ స్థానం

image

కాసేపటి క్రితం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో 5,487 మంది పరీక్షలు రాయగా… 3330 మంది పాసయ్యారు. మొత్తం 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా .. జిల్లా 12వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఒకేషనల్‌కు ప్రకాశం జిల్లాలో 862 మంది పరీక్ష రాయగా 534 మంది పాసయ్యారు. ఇందులో జిల్లా 62 శాతం ఉత్తీర్ణత సాధించింది.

Similar News

News December 9, 2025

తిరుపతి నుంచి చర్లపల్లికి స్పెషల్ ట్రైన్.. జిల్లాలో స్టాపింగ్ ఇక్కడే!

image

ప్రకాశంలోని పలు రైల్వేస్టేషన్ల మీదుగా ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళవారం తిరుపతి నుంచి చర్లపల్లి వరకు స్పెషల్ ట్రైన్ (07000) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జిల్లాలోని దిగువమెట్ట, గిద్దలూరు, కంభం, మార్కాపూర్ రోడ్, దొనకొండ రైల్వే స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుందని, జిల్లా ప్రయాణికులు గమనించాలని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు.

News December 9, 2025

ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

image

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

News December 9, 2025

ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

image

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.