News June 18, 2024
ఇంటర్ సప్లీ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు 19వ స్థానం

ఇంటర్ సెకండీయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3096 మంది పరీక్ష రాయగా, 1666 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 54 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఒకేషనల్ కోర్సులో ఏలూరు జిల్లా 11వ స్థానంలో నిలిచింది. మొత్తం 541 మంది పరీక్ష రాయగా, 322 మంది పాస్ అయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News December 4, 2025
ప.గోలో డీడీఓ కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించినున్న పవన్

ప.గో. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డిటిఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్గా గురువారం ప్రారంభిస్తారని గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధి అధికారి దోసిరెడ్డి తెలిపారు. డి ఎల్డీఓలను, డీడీవోలుగా కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇందులో జిల్లాలోని విస్సాకోడేరు, నరసాపురం, తాడేపల్లిగూడెం డి డి ఓ కార్యాలయాలు ప్రారంభిస్తారు అన్నారు.
News December 4, 2025
ప.గో: ఈ నెల 14 వరకే ఛాన్స్

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం ప్రారంభించింది. వీటి దరఖాస్తుల గడువు ఇటీవల ముగియగా..లబ్ధిదారుల దృష్ట్యా ఈ నెల 14వరకు పొడిగించింది. గతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి వివరాలను ఆన్లైన్లో తొలగించి..కొత్తగా అవకాశం కల్పించనుంది. ఇంటి ఏర్పాటుకు రూ.2.50 లక్షల రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి.
News December 4, 2025
పాలకొల్లు: మహిళ హత్య కేసులో..నిందితుడు అరెస్టు

పాలకొల్లులో ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..పాలకొల్లు టిడ్కో ఇంటిని అద్దె తీసుకుని రాధ అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో రాధతో గొడవ పడి టిట్కో భవనం మేడపైకి తీసుకెళ్లి..తోసేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కుమారై భవ్యశ్రీ ఫిర్యాదుతో సుధాకర్ను అరెస్టు చేశామని ఎస్సై పృథ్వీ తెలిపారు.


