News April 25, 2024

ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్.. 30వ స్థానంలో మంచిర్యాల

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 72.06 శాతంతో రాష్ట్రంలో కొమురం భీం జిల్లా 7వ స్థానంలో నిలిచింది. 4095 మందికి 2951 మంది పాసయ్యారు. 66.17 శాతంతో నిర్మల్ 12వ స్థానంలో నిలిచింది. 5477 మందికి 3624 మంది పాసయ్యారు. 65.75 శాతంతో ఆదిలాబాద్ 13 స్థానంలో నిలిచింది. 8320 మందికి 5470 మంది పాసయ్యారు. 59.53 శాతంతో 30వ స్థానంలో మంచిర్యాల నిలిచింది. 5370 మందికి 3197 మంది పాసయ్యారు.

Similar News

News November 4, 2025

భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం..!

image

గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

News November 4, 2025

అతివలకు అండగా షీటీం బృందాలు: ADB SP

image

అతివలకు షీటీం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా డయల్ 100, 8712659953 నెంబర్ కి సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలోని హాట్స్పాట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత నెలలో రెండు బాల్యవివాహాలు నిలిపివేయడం జరిగిందన్నారు

News November 3, 2025

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ఎస్పీ

image

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫోన్ ద్వారా సిబ్బందికి పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు.