News January 16, 2025

ఇంటికి వచ్చిన అల్లుడికి 200 రకాల వంటకాలతో భోజనం!

image

పెళ్లి తర్వాత సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వచ్చిన అల్లుడికి 200 వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన తోట వెంకటేశ్వరరావు, ఉమా దంపతులు ఉద్యోగరీత్యా విజయనగరంలోని చినతాడివాడలో నివాసం ఉంటున్నారు. గోదావరి సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో తమ అల్లుడు, కూతురైన సంతోశ్ పృథ్వి, ధరణిలను తమ ఇంటికి పిలిచి 200 రకాలకు పైగా చేసిన వివిధరకాల పదార్థాలను కొసరి కొసరి వడ్డించారు.

Similar News

News November 22, 2025

SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

image

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

News November 22, 2025

ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.

News November 22, 2025

ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.